IND vs WI: నేడు వెస్ట్ ఇండీస్ టెస్ట్ క్రికెట్ టూర్ లో భాగంగా భారత్ టీమ్ వెస్ట్ ఇండీస్ కు బయుదేరిన విషయం తెలిసిందే ఇక టీమ్ లో ప్లేయర్ల విషయానికి వస్తే
- రోహిత్ శర్మ (కెప్టెన్)
- యశస్వి జైస్వాల్
- సుబ్మన్ గిల్
- విరాట్ కోహ్లీ
- అజింక్య రహానే
- రవీంద్ర జడేజా
- ఇషాన్ కిషన్
- రవిచంద్రన్ అశ్విన్
- శార్దూల్ ఠాకూర్
- జయదేవ్ ఉనద్కత్
- మహమ్మద్ సిరాజ్
వంటి ప్లేయర్లతో IND vs WI టూర్ కి వెళ్ళడంతో ఇప్పుడు భారత్ టీమ్ పై అనేక అనుమానాలు ఎదురౌతున్నాయి అంతే కాక ఈ టీమ్ పై పలు విమర్శలు మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఫాస్ట్ బౌలింగ్ లో కొంచెం సిరాజ్ మినహా ఎవరికీ అంత అనుభవం లేకపోవడం ఈ టీమ్ లో సెలక్ట్ అవ్వడమే ప్రధాన కారణం. దీనిలో భాగంగానే నేటి మ్యాచ్ కి ముందు రిపోర్టర్ ఇండియన్ టీమ్ గురించి మరియు కొత్త ఫాస్ట్ బౌలర్ల గురించి కెప్టెన్ రోహిత్ శర్మను అడగగా ఇక్కడ మా పాస్ట్ బౌలర్లు చాలా వెకెట్లు తీయడం చూసాం కాని ఒక్కోసారి మా ప్లేయర్స్ కు గాయాలు అయినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటూ బదులిచ్చాడు.
అంతేకాక మా టీమ్ లో అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్లకు గాయాల గాయాల కారణంగా అనుబవం లేని బౌలర్లను సెలక్ట్ చేసి వీరినే టీమ్ కి ఉపయోగపడేలా వాడుకోవాలని బదులిచ్చాడు. అంతేకాక బుమ్రా ఇప్పుడిప్పుడే గాయాల నుండి కోలుకుంటున్నాడని తను వరల్డ్ కప్ కి పూర్తి ఫిట్ గా ఉంటాడని బావిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాక మహమ్మద్ షమీ కి కూడా రెస్ట్ ఇచ్చామని త్వరలో ఆసియా కప్ మరియు వరల్డ్ కప్ కు ముందు తనకు కొంచెం రెస్ట్ అవసరమని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ చెబుతున్న దాని ప్రకారం చూస్తే వరల్డ్ కప్ కు ఇప్పటికిపుడు పూర్తి ఫిట్ గా ఉన్న ప్లేయర్ ఒక్కడు కూడా లేరనే తెలుస్తోంది. టీమ్ ముందు ప్రాక్టీస్ లేకుండా మ్యాచ్ లు ఆడకుండా గాయాల నుండి కోలుకున్న బౌలర్లను అప్పటికప్పుడు వరల్డ్ కప్ కి ఎలా తీసుకుంటారని ఇలాంటి బౌలర్లు ఫెయిల్ అయితే వరల్డ్ కప్ మళ్ళీ చేజారుతుందని అబిప్ర్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇప్పుడు వెస్ట్ ఇండీస్ సిరీస్ కు వెళ్ళిన పాస్ట్ బౌలర్లపై రోహిత్ శర్మ ఇప్పుడు మా టీమ్ లో పాస్ట్ బౌలర్లలో లైనప్ లేదని చెప్పడం విచిత్రంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also…మీరు పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడితేనే మేము వరల్డ్ కప్ ఇండియాలో ఆడతాం….పాక్
Read Also…ICC World Cup 2023: IND vs PAK వరల్డ్ కప్ మ్యాచ్ పై సందిగ్ధత