ప్రపంచాన్ని తీవ్ర స్థాయిలో వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సందర్భాంగా కరోనా వ్యాక్సిన్ను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ పరిశోధనలలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓక కీలక ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని తాను విశ్వాసం వ్యక్తం చేశారు.
కరోనా అధికంగా ప్రబలుతున్న నేపథ్యంలో “క్లోరోక్విన్” వైరస్ ట్రీట్మెంట్ కి పనిచేస్తుందని భారత వైద్యులు తెలిపారు కానీ WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) దీన్నిఇంకా నిర్ధారించలేదు. అయితే ప్రస్తుతానికి వైరస్ నివారణకు రెమిడెసివర్ అద్భుతంగా పనిచేస్తోందని ట్రంప్ తెలిపారు..ఇక ఈ నేపథ్యంలో దానిపై దృష్టిపెట్టినట్టు తెలిపారు.అయితే వైద్య నిపుణులు మాత్రం కరోనా టీకా అభివృద్ధి చేసేందుకు దాదాపు 12 నుంచి 18 నెలల వరకూ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రజా ఆరోగ్య అధికారులూ సైతం ఇదే మాట చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా శ్వేతసౌధంలోని కరోనా టాస్క్ఫోర్స్ సభ్యుడు, ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డా.ఆంటోనీ ఫౌచీ గత నెలలో వ్యాక్సిన్ వీలైనంత త్వరగా అభివృద్ధి చేస్తే జనవరి లోగా పంపిణీ చేయొచ్చని తెలియజేశారు. ఇక ఇప్పటికి అనేక దేశాల్లో కరోనా వైరస్ టీకా కోసం తీవ్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇక బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకాపై కొన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇంకా చాలా దేశాల్లో వైరస్ విరుగుడును కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిదేశం ఇప్పుడు వాక్సిన్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఐరోపా సమాఖ్య సైతం విస్తృతంగా కలిసి పరిశోధనలు చేస్తున్నాయ్. ఈ పరిశోధనల కోసం దాదాపు 8 బిలియన్ డాలర్లు వెచ్చించారు.