ఇప్పటివరకూ క్రికెట్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న ప్రపంచ కప్ ముగుయడంతో క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించే IPL సీజన్ త్వరలో మన ముందుకు రానుంది. దీనిలో భాగంగానే మార్చ్ 23, 20124 నుండి మే 29 వరకూ జరిగే IPL ప్లేయర్స్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి దుబాయ్ లో కోకాకోలా ఎరీనా లోని ఈ వేలం ప్రక్రియ జరగగా మొత్తం 333 మంది ఆటగాళ్ల పై ఈ వేలం ప్రక్రియ జరాగగా ఈ వేలం ప్రక్రియలో మొత్తం పది ప్రాంచైజీలువేలం ప్రక్రియలో పాల్గొని ఆటగాళ్లను కొనుగోలు చేసాయి.
రసవత్తరంగా సాగిన ఈ వేలం ప్రక్రియలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టారు. వరల్డ్ కప్ సాదించిన జట్టుగా ఆస్ట్రేలియాకు కొంచే అడ్వాన్టేజ్ లబించడం ఒక విషయమైతే ఆస్ట్రేలియన్ కెప్టెన్ గా మంచి స్ట్రాటజీతో అద్భుతంగా రాణిస్తున్న ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది.
ఆర్సిబీ, హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ మూడు జట్ల మద్య రసవత్తరంగా జరిగిన వేలంలో సన్రైజర్స్ వేలంలో వెనకడుగు వెయ్యకపోవడంతో చివరకు హైదరాబాద్ పాట్ కమ్మిన్స్ ను దక్కించుకుంది.
ఇక వరల్డ్ కప్ ఫైనల్ లో అద్భుతంగా రాణించిన ట్రావిస్ హెడ్ ను మరోసారి చెన్నై ఈ పోటీలో సాగినా చివరకు హైదరాబాద్ ట్రావిస్ హెడ్ ను వేలంలో 6.8 కోట్లకు దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియన్ ఆటగాడు మిచెల్ స్టార్క్ పాట్ కమ్మిన్స్ రికార్డ్ బద్దలుకోడుతూ ఏకంగా 24.75 కోట్లు పెట్టి కోల్కత నైట్ రైడర్స్ సొంతం చేసుకున్నారు. ఇక ఇండియన్ ఆతగాళ్ళు ను సైతం మంచి ప్రైస్ కు సొంతం చేసుకున్నారు.
Read More..టీమ్ ఇండియా ప్లేయర్ సీక్రెట్ బయటపెట్టిన శ్రేయస్ అయ్యర్