శనివారం, జూలై 27, 2024
Homeఅంతర్జాతీయంఫిలిపీన్స్ నౌకపై చైనా నౌక జల పిరంగులతో దాడి

ఫిలిపీన్స్ నౌకపై చైనా నౌక జల పిరంగులతో దాడి

భూ ఆక్రమణ వాదంతో ఇప్పటివరకూ శత్రు దేశాల భూములు హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించిన చైనా ఇప్పుడు దక్షిణ చైనా పై పట్టుకోసం నానా కుయుక్తులూ పన్నుతోంది. తాజాగా షోల్ ప్రాంతంలో చైనాకు చెందిన నౌక పిలిఫీన్స్ నౌకను బలంగా డీకొట్టింది. దీనితో రెండు దేశాల సైనికులు గర్షణకు దిగారు అయితే వివాదాస్పద షోల్ ప్రాంతానికి చైనా నౌకలే వచ్చి తమపై దాడి చేశాయని పిలిపిన్స్ సైనికులు తెలిపారు.

ఫిలిపీన్స్ నౌకపై చైనా నౌక జల పిరంగులతో దాడి

తమ నౌకతో పాటు మరో మూడు నౌకలపై జల పిరంగులతో దాడికి చైనా పాల్పడిందని పిలిపిన్స్ సైనికులు ఆరోపించారు. తమ నౌక ముందుకీ వెనక్కీ కదలకుండా చైనా నౌక ఆడ్డుకుందని తెలిపారు. చైనా దాడిలో మా నౌక యొక్క ఇంజెన్ ఫెయిల్ అయిందని ఫిలిపిన్స్ సైనికులు ఆరోపించారు.

దాడి ఘటన వీడియో రిలీజ్ చేసిన ఫిలిప్పీన్స్ 

అయితే పిలిఫీన్స్ అధికారులు చైనా కోస్ట్ గార్డ్ అధికారులకు జరిగిన ఘటన తెలిపినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని పిలిఫిన్స్ అధికారులు తెలిపారు అంతేకాక అక్కడ జరిగిన ఘటన వీడియోని విడుదల చేసారు. అయితే చైనా మరియు పిలిఫిన్స్ దేశాల మద్య ఈ వివాదం ఇప్పటిది కాదు.

2012 నుంచే కొనసాగుతున్న ఫిలిపీన్స్ మరియు చైనా మద్య వివాదం

ఏప్రెల్ 8, 2012 న షోల్ ప్రాంతంలో చైనా మరియు పిలిపిన్స్ నేవీ మద్య వివాదం చెలరేగింది ఆ వివాదంలో అప్పట్లో ఫిలిఫీన్స్ నేవీ చైనాకు చెందిన 8 ఫిషింగ్ బొట్లను పట్టుకోవడంతో అప్పటినుంచి ఈ ప్రాంతంలో చైనా మరియు పిలిఫ్ఫీన్స్ మద్య వివాదం చెలరేగింది.

Read Also: మా అప్పు తీర్చకపోతే ఇక జరిగేది అదే..పాకిస్థాన్ కి చైనా గట్టి వార్నింగ్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular