శనివారం, జూలై 27, 2024
Homeసినిమాసైబర్ క్రైమ్ కి 30 ఇయర్స్ పృథ్వి

సైబర్ క్రైమ్ కి 30 ఇయర్స్ పృథ్వి

టాలివుడ్ హాస్య నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ ఆయనపై గట్టిగానే జరుగుతున్నాయి. ఆ మధ్య పృథ్వి ఆడియో టేప్ కూడా బయటపడిన దగ్గర నుంచీ నెటిజన్స్ తనని ఒక ఆట ఆడుకుంటున్నారు.

ఈనేపథ్యంలోనే  టిక్‌టాక్‌ అలాగే  పలు సామజిక మాధ్యమాల్లో కొన్ని పృథ్వి వీడియోలను ఎడిట్ చేసి పెట్టడం తెలిసిందే ఈ వ్యవహారంపై అయన మండిపడ్డారు. తనని కించపరుస్తున్నారని పృథ్వీరాజ్‌ ఆరోపించారు.

ఈ ఘటనపై హైదరాబాద్ లో‌ సైబర్ క్రైం పోలీసులకు పృథ్వి ఫిర్యాదు చేశారు . తన వీడియోలను ఎడిట్ చేసి తన మనోభావాలు నోచ్చుకునేలా తనను అవమానిస్తున్నారని, తనను కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు పృథ్వి.

ఇలా ట్రోల్స్ చేసేవాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular