కరోనా ప్రభావంవళ్ళ ప్రపంచ దేశాల పజలు చిగురుటాకులా వణుకుతున్నాఋ.ప్రస్తుతం ఇంచు మించు ప్రతీ దేశం లాక్ డౌన్ నిభంధనలను పాటిస్తున్నాయి.ఇక పలు దేశాల్లో మరణాల సంఖ్య ప్రతీ రోజుకు వేళల్లో ఉంటున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికాలోని వర్జీనియాకు చెందిన అక్కడి చర్చ్ వ్యవస్థాపకుడు బిషప్ గెరాల్డ్ అక్కడి చర్చ్ లో నిభంధనలను ఉల్లంగిస్తూ పలు వ్యాక్యాలు చేసారు. ఈ వైరస్ మనల్ని ఏమిచేయలేదు ఈ విషయాన్ని మన పిల్లలకు సైతం అర్ధంయ్యేవిధంగా వారికి తెలియజేయాలి. ఇప్పుడున్న కరోనా వైరస్ కన్నా దేవుడు చాలా గొప్పవాడని నేను దృడంగా నమ్ముతున్నారు. ఇలాంటి వైరస్ కు మనం బయపడొద్డంటూ ఆయన అక్కడి చర్చ్ కి వచ్చిన ప్రజలకు పిలిపునిచ్చారు.
అయితే ప్రస్తుతం ఈ ప్రార్ధనలు మార్చ్ 22వ తేదీన జరుగగా అమెరికాలో ఈ వైరస్ ప్రభావం ఘననీయంగా పెరగడంతో ఆ చర్చి ఫాదర్ కి కూడా కరోనా వైరస్ సోకి ఇటీవల మరణించారు. ఇప్పుడు ఈ విషయం పై సోషల్ మీడియాలో పలు వీడియోలు నేడు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రజల శ్రేయస్సు కోరి ప్రభుత్వం ఎన్ని చెప్పినా ఇలాంటి సమయంలో కూడా మతోన్మాదుల మాటలతో ప్రజల ప్రాణాలను ఆపదలో పెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.