శనివారం, జూలై 27, 2024
HomeజాతీయంPM Modi తో సీఎం ల వీడియో కాన్ఫెరెన్స్ .. లాక్ డౌన్ పొడిగింపుకు మొగ్గు

PM Modi తో సీఎం ల వీడియో కాన్ఫెరెన్స్ .. లాక్ డౌన్ పొడిగింపుకు మొగ్గు

కరోనా వ్యాప్తిని అరికట్టే నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ గడువు అనుకున్న సమయానికి ముగుస్తుందా లేక పొడిగిస్తారా అన్నదానిపై దేశం యావత్తు ఉత్కంఠ నెలకొంది. నేపథ్యంలో PM Modi ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు.

కరోనా వైరస్ గురించి ప్రధాని మాట్లాడుతూ అందరు వైరస్ పై పోరాడుతున్నామని ఓ వైపు ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే వైరస్​పై పోరులో ముందుకు సాగాలని సూచన చేశారు. దేశం మొత్తం లాక్​డౌన్ విధించి చాలా ప్రాణనష్టాన్ని అరికట్టి ఎంతో  మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు.

ఇక ప్రస్తుతం లాక్​డౌన్ దేశమంతటా నడుస్తోంది ఇక దీని ఫలితాలు రాబోయే నెలల్లో కనిపిస్తాయని తెలిపారు. ఇకపోతే రాష్ట్రాలు ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని మోదీ వెల్లడించారు. ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి తో కలిసి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.

వీడియో కాన్ఫిరెన్స్లో పాల్గొన్న ఛత్తీస్​గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ ఇక రాబోయే రెండునెలల్లో అంటే ‘జూన్, జులై నెలల్లో మరోసారి కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రధాని తెలిపినట్లు చెప్పారు. రెండో దశ వైరస్ ముప్పును తట్టుకునేలా అన్ని రాష్ట్రాల్లో చర్యలు తీసుకోవాలని ప్రధాని విన్నవించినట్టు చెప్పారు.

పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ విశేషాలను తెలిపారు.చాలా వరకూ లాక్​డౌన్ కొనసాగింపునకే మెజార్టీ ముఖ్యమంత్రులు మొగ్గు చూపారని తెలిపారు నారాయణస్వామి. రాష్ట్ర ఆర్థిక వ్యావహారాలను స్వల్పంగా అనుమతించాలని సీఎంలు PM Modi ని అభ్యర్ధించినట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలో సీఎంలు, ఆరోగ్య శాఖ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి ముఖ్యమంత్రుల వినతిపై ప్రధాని ఏ విధమైన వ్యాఖ్య చేయలేదని చెప్పారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular