లాక్ డౌన్ లో మెల్లమెల్లగా సడలింపులు అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నిటికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వగా ప్రస్తుతం ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎం లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో మే 17 తర్వాత లాక్ డౌన్ 4 కొత్త నిబంధనలతో ఉండబోతోందని ఆ మార్గదర్శకాలను మే 18 న తెలియజేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నట్టు ప్రధాని మోదీ సూచనల మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ ప్రభుత్వం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో షాపులు, ఇతర కార్యకలాపాలకు 2 కమిటీలు ఏర్పాటు చేసిందని సమాచారం. ఇండస్ట్రీస్కు సంబంధించి కమిటీ కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధికి సమందించి 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుకి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.
ఇక ముగ్గురు సభ్యులతో ప్రజా రవాణా కమిటీ, ఇక ప్రభుత్వ రంగ నిర్మాణాలకు ముగ్గురు సభ్యులతో కమిటీ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మరియు ఇతర కార్యక్రమాలు పరిశీలించేందుకు వేరుగా కమిటీలు ఏర్పాటుచేయనున్నారు. ప్రతిశాఖకు ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్సులు, కార్యదర్సులు, కమిషనర్లు, డైరెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక వీటన్నిటికీ సంబందించి
దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూప్రింట్ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు.. ఎపి ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ ప్రభుత్వం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో షాపులు, ఇతర కార్యకలాపాలకు 2 కమిటీలు ఇండస్ట్రీస్కు సంబంధించి కమిటీ ఏర్పాటు, వ్యవసాయ, అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధికి 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.
ప్రజా రవాణాకు ముగ్గురు సభ్యులతో కమిటీ, ప్రభుత్వ రంగ నిర్మాణాలకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కమిటీ….ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు కమిటీ వేయనున్నారు. ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్సులు, కార్యదర్సులు, కమిషనర్లు, డైరెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేసి రేపు మ.3గంటల లోగా బ్లూ ప్రింట్స్ ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం.