శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంరాష్ట్రంలో ఈ జోన్ల గురించి మీకు తెలియాల్సిందే..

రాష్ట్రంలో ఈ జోన్ల గురించి మీకు తెలియాల్సిందే..

కరోనా విజృంభిస్తున్న వేళ  ఆ వైరస్ కట్టడిని ఆపేందుకు రాష్ట్రాల్లో అలాగే దేశంలో వివిధ జిల్లాలను ప్రాంతాలను గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్స్ గా విభజించారు. దీనివల్ల సమస్యని పెరగకుండా ఆపడంతో పాటూ ఆ ప్రాంతంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచి అవగాహన కల్పించడం.

ఈ నేపథ్యంలోనే  దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం పై అలాగే జోన్లు, చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలపై  రాష్ట్ర సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ లేఖ రాశారు. నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి తీవ్రత ఆధారంగా జోన్లు విభజించామన్నారు. రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో మార్పులు చేసినట్లు ప్రీతి సూదన్ తెలిపారు.

లాక్ డౌన్ లో పలురాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు ప్రీతి సూదన్ అన్నారు. కొత్తగా వచ్చిన జాబితా ప్రకారం దేశంలో 130 జిల్లాలు రెడ్ జోన్లలో ఉన్నాయన్నారు. ఆరెంజ్ జోన్‌లో 284, గ్రీన్‌ జోన్‌లో 319 జిల్లాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ జిల్లాలను కేంద్రం ప్రకటించింది.

వీటిలో రెడ్‌జోన్‌ జిల్లాలుగా కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉండగా.. గ్రీన్ జోన్ లో విజయనగరం ఉంది. ఇక ఆరెంజ్ జోన్ లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం ఉన్నాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular