శనివారం, జూలై 27, 2024
Homeఅంతర్జాతీయంTelugu News : భారత్ లో ఉన్న లద్దాఖ్ ని మాయం చేసిన చైనా

Telugu News : భారత్ లో ఉన్న లద్దాఖ్ ని మాయం చేసిన చైనా

Telugu News : భారత్  పై చైనా ఒక వైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మరోవైపు వెనకనుండి గోతులు తవ్వుతుంది. దీనికి ప్రదాన ఉదాహరణ లద్దాక్ ప్రాంతం. ప్రస్తుతం భారత దేశంలో చైనా ఫోన్ ల అమాకాలలో ఆ దేశం ఇప్పటివరకూ తన రాజ్యంఏలుతోంది.

దేశంలో 70శాతం పోన్లు చైనా చెత్తతో నింపేసింది. దీనిని అదునుగా తీసుకుని చైనా తన వక్ర బుద్దిని ప్రదర్శించింది. గత కొంతకాలంగా లద్దాక్, అరుణాచల్ ప్రదేశ్, లలో పలు ప్రాంతాలు తమవేనంటూ వాదిస్తూ వచ్చింది చైనా.

అయితే తాజాగా ఈ ప్రాంతాలను భారతీయ చైనా పోన్లలో ప్రదానంగా Mi పోన్లలో ఉండే “వెదర్” యాప్ లో లద్దాక్ ప్రాంత  వెదర్ సమాచారాన్ని చూపించడంలేదు. దీనికి కారణం లద్దాక్ ను చైనా భూబాగంగా చూపించడమే.

ఇంకా ఇండియాలో ఉన్న అనేక చైనా మొబైల్ లలో ఉండే మ్యాప్ లలో భారత్ భూబాగాలను సైతం మాయం చేసింది. ఇప్పటికే చైనా యాప్స్ ద్వారా యూజర్స్ డేటా చైనా దొంగిలిస్తుందనే కారణంగా కేంద్ర ప్రభుత్వం సుమరు 140 యాప్స్ ను ప్లే స్టోర్ నుండి తొలగించింది.

ప్రస్తుతం చైనా చేసిన ఈ పనికి దేశ వ్యాప్తంగా చైనా పోన్లను పూర్తిగా బ్యాన్ చెయ్యాలని కేంద్రం పై గత రెండు రోజులుగా వత్తిడి పెరిగింది. అయితే ప్రదాని మోడీ రెండు రోజుల క్రితం చైనా కంపెనీలకు చెందినా ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీ, ఫ్రిజ్జ్, ఏసీ, టైర్లు వంటి పలు ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది.

దీనిలో మరో గమ్మత్తు ఏమిటంటే అదేరోజు చైనా మొబైల్స్ లలో ఉండే మ్యాప్ లలో భారత్ కు చెందిన డేటాను మాయం చేసిన విషయాని భారత్ గుర్తించడం. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం చైనా ప్రతీ భారతీయుని జీవితంలోకీ ఎంతరైపోయింది.

మన దేశ వెదర్ ను చూపించకుండా మాయం చేసిన చైనా మన డేటా దొంగిలించదనే నమ్మకం కూడా లేదు. ఇక నైన చైనా ఫోన్లపై బ్యాన్ విదించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.       

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular