బీజేపీ పేరు చెబితే కారాలుమిరియాలు నూరే మమతా మరోసారి భాజపా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్య భాజపా బెంగాల్ వీధుల్లో ర్యాలీ చేశారు. ఆ సమయంలో భాజపా శ్రేణుల్ని ఆపేందుకు బంగాల్ పోలీసులు ప్రయత్నించగా తీవ్ర ఘర్షణకు తీసిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా కరోనా రూల్స్ కి విరుద్ధంగా ర్యాలీ చేశారని అటు బంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎప్పటిలాగే భాజాపాపై విరుచుకుపడ్డ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. “ఓ వైపు మనకు కొవిడ్-19, డెంగీ ఉన్నాయి. మరోవైపు భాజపా లాంటి అతిపెద్ద మహమ్మారి కూడా ఉంది. భాజపా ఓ దుష్ట శక్తి బంగాల్ రాజకీయాల్లోకి ప్రవేశించాలంటే కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండాలి.”అంటూ బీజేపీ పై విమర్శలు గుప్పించారు మమతా.
WhatsApp Group
Join Now