విశాఖ ఉక్కు కర్మాగారం పై నష్టాలను షాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకుంది. దీనిలో బాగంగా అప్పటి నుండి నిరసన, ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే అయితే ఈ ఉద్యమం చేపట్టి నవంబర్ 9 నాటికి వెయ్యి రోజులు పూర్తి కావస్తున్న తరుణంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మరియు కాలేజీల బంద్ కు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (AISF), ప్రోగ్రసీవ్ డెమోక్రాటిక్ స్టూడెంట్ యూనియన్ (PDSU), (AIYF), సంఘాలు ఈ నెల 8వ తారీకున రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు.
ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలకు నోటీసులు ఇచ్చి బంద్ కు మద్దతివ్వాలని కోరారు. అంతేకాక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సహకరించాలని కోరుతూ 32 మంది కార్మికుల బలిదానంతో విశాఖ ఉక్కు నెకొందని కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకావాలని కోరారు.