తెలుగు సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి జయంతి ప్రస్తుతం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వారి కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. హాస్పిటల్ లో ఆమె వెంటిలేటర్ మీద ఉన్నట్లు సమాచారం. జయంతి శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది చెందడంతో ఆమెను నిన్న అంటే మంగళవారం హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే నటి జయంతి 35 ఏళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఆమెకు ప్రస్తుతం వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని 24 గంటలపాటు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
జయంతి 1945 సంవత్సరంలో బళ్లారిలో పుట్టారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, మరాఠీ భాషల్లో దాదాపు 500కిపైగా సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులో చాలా సూపర్ హిట్స్ లో నటించి హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆమె కెరీర్ రో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా ‘పెదరాయుడు’ సినిమాలోని మోహన్బాబుకు అత్తయ్యగా మరియు సూపర్ స్టార్ రజనీకాంత్కు చెల్లెలుగా, నటించి ప్రేక్షకుల నుండి మంచి పేరు తెచ్చుకున్నారు. 1950 నుంచే జయంతి గారు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయ నటిగా ప్రెసిడెంట్ మెడల్, రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఆమె అందుకున్నారు. అయితే ఈమెపై పలు మార్లు సోషల్ మీడియాలో ఆమె చ్నిపోయారంటూ అనేక వార్తలు బయటికి రావడంతో వాటిని ఆమె ఖండించారు.