...
Homeజాతీయంకరోనా ఎఫక్ట్ ఖైదీలకు పండగ

కరోనా ఎఫక్ట్ ఖైదీలకు పండగ

నేడు ప్రపంచ వ్యాప్తంగా అతి వేగంగా విస్తరిస్తున్న కరోనాని  ఆపడానికి  సామాజిక దూరం పాటించడం తప్ప మరే ఇతర మార్గం లేదు.. ఒకే చోట జనం గుమిగూడకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తపడటం స్వీయ నిర్బంధం ఇలాంటి జాగ్రత్తలతో కరోనాని అరికట్టగలం. ఈ నేపథ్యంలోనే జైల్లో ఉన్న ఖైదీల సంఖ్య కూడా తగ్గించాలని. తాత్కాలికంగా వాళ్ళను జైల్ల నుండి  విడుదలచేయాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీచేసింది.

దీనితో ఇప్పటికే జైల్లో ఉన్న ఖైదీలను విదులచేయాలని నిర్ణయించారు జైల్ల అధికారులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో  జైల్లో ఉండే ఖైదీలు కిక్కిరిసి ఉండకుండా కొద్దిగా విశాలంగా ఉండటానికి వారికి అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.గత కొద్ది రోజుల క్రితం విశాఖలో సెంట్రల్ జైల్లో ఏడేళ్ల లోపు శిక్ష పడిన ఖైదీలతోపాటు ఎక్కువసంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న రిమాండ్ లో ఉన్న ఖైదీలను సైతం అధికారులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాక కడప జైల్లో ఉన్న 30 మంది ఖైదీలను సైతం బెయిల్ పై విడుదల చేశారు. వీరిలో 16 మంది పలు  శిక్షలు పడిన ఖైదీలు ఉండగా మరో 14 మంది రిమాండ్‌ ఖైదీలు ఉన్నారు. కరోనా తీవ్రత అదికంగా ఉండడంతో  జైళ్లలో ఖైదీల రద్దీ తగ్గించే క్రమంలో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. అయితే బెయిల్‌పై విడుదలైన ఖైదీలందరూ ఈ నెల 27న మరలాజైలుకు రావాలని జైలు అధికారులు సూచించారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.