శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeజాతీయంఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం భారీ షాక్ | central government employees

ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం భారీ షాక్ | central government employees

central government employees news కరోనా తో దేశం పోరాడుతోంది. అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని మోడీ ఒకవైపు కరోనా కట్టడికి కృషి చేస్తూనే మరోవైపు ఆర్ధిక వ్యవస్థ గాడితప్పకుండా చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ ను నిలుపుదల చేయనున్నట్టు గురువారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వఉద్యోగస్తులకు, పెన్షన్ దారులకి  మునుపు డీఏ ను పెంచిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ పెంపును నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకూ డీఏ ల బకాయిల చెల్లింపులు కూడా ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు సమాచారం. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న డీఏ మాత్రమే కొనసాగుతుందని తెలిపింది ప్రభుత్వం. ఈ కరువుభత్యం ఆపెయ్యడంవల్ల కేంద్రానికి 14 వేల 510 కోట్లు ఆదా అవుతుందని అంచనా.

దీనిప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న ఒక కోటి 30 లక్షలమందిపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం పై పడుతున్న భారాన్ని ఎంతోకొంత తగ్గించుకునే దిశగా ఈ కరువు భత్యంలో కోత విధించడం జరిగింది. తుదినిర్ణయం వెలువడేవరకు డీఏ లు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular