నేడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబందనలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమావ్వడంతో దేశ వ్యాప్తంగా రోడ్లపై జనం తిరగటం, వాహనాల సౌండ్ కారణంగా అటవీ ప్రాంతాల జంతువులు పెద్దగా రోడ్లపైకి వచ్చేవి కావు. అయితే ఇప్పుడు అవేమీ లేకపోవడంతో మూగ జీవాలు పక్షులు, జంతువులు రోడ్లపై స్వేచ్చగా తిరుగాడుతున్నాయి.
కొన్నిరోజుల క్రితం తిరుపతి కొండ మీద జింకలు రోడ్లపై తిరుగుతూ సంచరించగా నేడు రాజస్థాన్ లోని ఒక అటవీ ప్రాంతానికి దగ్గరగా కొన్ని వందల నెమళ్లు రోడ్లపై నాట్యం చేస్తూ చూపరులను ఆకట్టుకున్నాయి. అయితే రాజస్థాన్ కు చెందిన ప్రవీణ్ కస్వాన్ అనే యువకుడు ఈ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ప్రస్తుతం తెగ చెక్కర్లు కొడుతుంది.