క్రికెట్ అబిమానులకు, జియో వినియోగాదారుఅలకు శుభవార్త. ఇకపై టీమ్ ఇండియా ఆడే క్రికెట్ మ్యాచ్ లన్నీ జియో టీవీలో చూసే అవకాసం కల్పిస్తుంది. ఈ మేరకు స్టార్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్ జియో వచ్చే ఐదేళ్ళ పాటు మీరు క్రికెట్ లైవ్ స్ట్రీం చూడాలంటే జియో టీవీ యాప్ ఉంటే చాలు. మీరు ఉన్నచోటే జియో టీవీ యాప్ లో ఇండియా ఆడే అన్నీ క్రికెట్ మ్యాచ్ లనూ చూడవచ్చు.
Telugu Entertainment
ఎప్ప్పుడూ ప్రత్యర్ధి కంపెనీలకు దీటుగా ఆఫర్స్ ఇచ్చే జియో ఇప్పుడు స్టార్ ఇండియాతో కలిసి ఒప్పందం కుదుర్చుకోవడంతో స్పోర్ట్స్ ఎంటర్ టైన్మెంట్ రంగలో మరో అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి.
హై స్పీడ్ డేటాలతో రికార్డులు సృష్టిస్తున్న జియో క్రికెట్ యూజర్లకు ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. జియోటీవీ, హాట్ స్టార్ యూజర్లు ఇండియా ఆడే ప్రతీ మ్యాచ్ జియోటీవీలో చూడవచ్చు.
మొదటినుంచీ ఎక్స్క్లూజీవ్ కంటెంట్ తో భారతీయ యూజర్లను ఆకర్షిస్తున్న జియో ఇప్పుడు జియోటీవీ కూడా అలాగే కస్టమర్లకు చేరువవుతా మని, క్రికెట్ మ్యాచ్ లను నాణ్యతతో అందిస్తామని చెబుతున్నారు. ఈ ఒప్పందంలో జియో యూజర్లకు మంచి కంటెంట్ అందుబాటులోకి వస్తుంది .
స్పోర్ట్స్, ఏఆర్ , వీఆర్ లాంటి అనేక అంశాల్లో కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తామని చెప్పారు. అంతేకాక దీనిలో టీ-20, వన్డే ఇంటర్ నేషనల్ మ్యాచ్ లు, ఇంటర్ నేషనల్ టెస్ట్, బీసీసీఐ నిర్వహించే ప్రీమియర్ మ్యాచ్ లను వీక్షించవచ్చు.