polavaram project ముంపు ప్రాంతానికి సంబంధించి నిర్వాసితులకు పునరావాస కోసం అందాల్సిన పరిహారం కింద రూ.79 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దేవీపట్నం మండలంలోని 6 గ్రామాలకు రూ.79 కోట్లు విడుదల చేసింది. అయితే ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 41.5 మీటర్ల మేర నీటి నిల్వకు వీలుగా ప్యాకేజీ అమలు చేయాలని నిర్ణయించింది.
polavaram project నిర్వాసితులకు శుభవార్త అందింది. పునరావాస పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 1106 కుటుంబాలకు ప్యాకేజీతో పాటు భూసేకరణకు జలవనరులశాఖ ప్రస్తుతం నిధులు అలాట్ చేసింది. దేవీపట్నం మండలంలోని ఆరు గ్రామాలకు ఈ నిధులు వెచ్చించనున్నారు. అయితే ఎగువన ఉండే కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్ నీటి నిల్వకు వీలుగా ప్యాకేజీ అమలు చేయాలని నిర్ణయించింది
WhatsApp Group
Join Now