ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాద్ aఅంటే తెలియనివారుండరు ఆయన ఎలాంటి వారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీఎం గా ఆయన ఇండియాలోనే ఒక బెస్ట్ సీఎం గా పేరుతెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అడిత్యనాద్ ఒక సారి రూల్ చేసాడంటే దానిని ఎవ్వరైనా పాటించాల్సిందే.
అయితే గత కొన్నాళ్ళుగా ఆయన తండ్రి ఆనంద్ సింగ్ కొన్నాళ్ళుగా కాలేయం, మూత్రపిండాల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తరుణంలో ఆయన్ను ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆదిత్యనాద్ తండ్రి వయస్సు 89సంవత్సరాలు.
గతంలో ఆనంద్ సింగ్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పంచేశారు. యోగి ఆదిత్యనాద్ వలే ఆయనకూడా నిబద్దత కలిగిన వ్యక్తి. సొంత ఫ్యామిలీ లో సైతం ఉద్యోగంలో ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం వచ్చే చాన్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ పాస్ అయితేనే ఉద్యోగం ఇవ్వండి అన్న వ్యక్తి ఆనంద్ సింగ్. లాక్ డౌన్ ఉన్న నేపద్యంలో తాజాగా ఆయన మరణంతో యోగి ఆదిత్యనాద్ తన తండ్రి అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితి.