కేదార్ నాథ్ మరియు బదరీనాథ్ మందిరాలకి కొంచం పైన మంచు విరివిగా ఉండే ప్రదేశం ఉంటుంది. అక్కడ ఎటుచూసినా ముత్యంలా మంచు కప్పి ఉండే ఆ ప్రాంతంలో చాలా లోయాలుంటాయి ఆ లోయల్లో పూచే బ్రహ్మకమలాలు చాలా అరుదు అంతే కాక అవి అపురూపం కూడా అవి కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూలు పూసి చూపరులను కనువిందు చేస్తాయి. అయితే ఈ మధ్య వీటి పూత అంతగాలేదు కానీ ఈ ఏడాది అక్కడి సుందర లోయల్లో బ్రహ్మ కమలాలు విరివిగా పూసాయి వీటి పూతతో లోయలకు మరింత అందం వచ్చి చేరింది.
శ్రావణ , భాద్రపద మాసాలలో ఈ బ్రహ్మ కమలాలను కోసుకుని వస్తూ ఉంటారు. అయితే నేడు కరోనా లాక్ డౌన్ కారణంగా వాతావరణ కాలుష్యం పెద్దగా లేకపోవడంతో మంచుకొండల్లో బ్రహ్మకమలాలు సుందరంగా విరబూసాయి. ఈ స్థాయిలో బ్రహ్మకమలాలు విరబూయడం ఇంతకు మునుపెన్నడూ ఇక్కడ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. సంవత్సరానికి ఒక సారి మాత్రమె పూసే ఈ పూలు ఎంతో ప్రత్యేకమైనవి. చుట్టు మంచు మధ్యలో ఉండే ఈ చెట్లు విరబూసి అక్కడికి వచ్చిన యాత్రికులను మరియు చూపరులను కనువిందు చేస్తున్నాయి.