మంగళవారం, మార్చి 19, 2024
Homeజాతీయంభారతీయుల జీవన విధానమే గొప్ప .. కరోనా పై ఆశక్తికర కథనం.

భారతీయుల జీవన విధానమే గొప్ప .. కరోనా పై ఆశక్తికర కథనం.

ఒక విధంగా చెప్పాలంటే మన భారతీయులు జీవిస్తున్న జీవన విధానమే మనకు రక్ష. అనేక పెద్ద ఇతరదేశాల్లో అమెరికా (యూఎస్ఏ) లాంటి దేశాల్లో  వారి అతి శుభ్రతే వారి కొంప ముంచింది. మన భారత దేశపు అలవాట్లే ఇప్పుడున్న తరాల  వాళ్లకు శ్రీరామ రక్షగా నిలిచిందని  అన్నారు.

అమెరికాకు చెందిన  వైరాలజిస్టు డా.ఎమ్.ఎస్.రెడ్డి అసలు కరోనా ఇంత శరవేగంగా విస్తరించడానికి  అసలు ఈ వైరస్ కు కారణమైన సార్స్ కోవ్ -2 ఆర్.ఎన్.ఏ కొంచెం విభిన్నం. ఈ కరోనా వైరస్ చుట్టూ కొమ్ములు వంటి ఒకరకమైన ఆకారాలు ఉండటంతో కణాలకు ఇది మరింత బలంగా అతుక్కుంటుంది. ఈ వైరస్ కి లోపల 10 జీన్స్ ఉన్నాయి.

ఈ కరోనా వైరస్ శరీరంలోని మానవకణాన్ని అతుక్కున్న వెంటనే దాన్ని చంపేసి లోపల అది విస్తరిస్తుంది. ఇది ఒక చిన్న స్పర్శకే వ్యాపిస్తుంది. అందువల్లనే ఇంతలా వేగంగా విస్తరించింది. మన అలవాట్లపై ఇతర దేశాలవాళ్ళు చిన్నచూపు చూస్తారు కానీ భారతదేశపు అలవాట్లే భారతీయులను ఇలాంటి సమయాలలో కాపాడుతున్నాయి.

ఇతర దేశాల్లో ఆహారానికి స్పూన్లు వంటివి తప్ప చేతితో ఆహారాన్ని ముట్టరు కాని భారతీయులు  చేతులతో ఆహారాన్ని తినడం మరియు రోడ్లపై దుమ్మూ దూలిలో బయట ఆడుకోవడంతో మన రోగ నిరోధక శక్తి పెరిగింది. భారతీయ జీవన విధానంలోనే కరోనా నుంచి బయటపడే  పరిష్కారముంది.

అంతేకాక మనం రోజూ తినే భోజనానికి ముందు ఒకసారి చేసిన  తర్వాత  ఒకసారి చేతులు కడుక్కుంటాం, చెప్పులతో ఇంట్లోకి ఎవర్నీ రానివ్వం. ఇవన్నీ వైరస్ ను మనకు దూరం పెట్టేవే. ఇలాంటి పనులవల్ల ఒక్క కరోనా మాత్రమె కాదు మరే ఇతర వైరస్ లను అయినా కొంత వరకూ మన అలవాట్ల ద్వారా నివారించావచ్చు.

మనం ఎక్కువగా  పసుపు, వెల్లుల్లి, లవంగాలను వంటల్లో వాడతాము. వీటన్నిటివల్ల యాంటీ వైరల్, మనం రోజూ తీసుకునే మజ్జిగ, పెరుగు జీర్ణకోశంలో ప్రో బయాటిక్స్ ను తయారు చేస్తాయి. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక వైరస్ లు సోకకుండా ముందు జాగ్రత్తగా వాడే మందులు సైతం మన వద్ద ఉన్నాయి అంతేకాక విటమిన్లూ వాడుతున్నాం. వైరస్ లోని జీవపదార్థం మన కణజాలంలోకి వెళ్లకుండా ఆపే మందులు కూడా ఉన్నాయి.

ఇక భారతీయుల్లో సహజంగానే ఉండే యాంటీబాడీలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని అవి కరోనాను ఎదుర్కొంటాయని, అందుచేతనే దానిగురించి అంతగా  భయపడాల్సిన పనిలేదని ప్రవాసాంధ్రులు, వైరాలజిస్ట్ , అమెరికాలో వ్యాపారవేత్త డా.ఎమ్.ఎస్.రెడ్డి తెలిపారు.

అమెరికాలో డా.ఎమ్.ఎస్.రెడ్డిగా ప్రసిద్ధి చెందిన డా.మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డిది నెల్లూరు జిల్లా ఉప్పలపాడు. ఆయన భారత్ నుంచి అమెరికా వెళ్లిన మొదటి తరం వ్యక్తి. అమెరికాలో  మైక్రోబయాలజీలో ఎమ్మెస్ , వైరాలజీలో పీహెచ్ డీ కూడా చేశారు.

ఈయన అమెరికాలో ఇంటర్నేషనల్ మీడియా అండ్ క్లస్టర్స్  డెయిరీ ఉత్పత్తుల సంస్థను స్థాపించి, ఈ రంగంలో  ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఎదిగారు, ఆయన ఎంతో శ్రమతో దాన్ని తీర్చి దిద్దారు. ఈ సంస్థ ద్వారా పాల ఉత్పత్తుల నిల్వకు సంబంధించి ఉపయోగపడేలా స్వయంగా పలు వైరస్ లను అభివృద్ధి చేశారు.

కరోనా వైరస్ లో ఎక్కువ శాతం కొవ్వు పదార్థమే ఉండడం వళ్ళ  మనం  తరచుగా సబ్బుతో చేతులు కడుక్కుంటే పోతుంది. 80% మంది కరోనా నుంచి ఇలాగే రక్షణ పొందుతారు. ఇక పదిహేను శాతం మందిలో ఈ కరోనా  వైరస్ నోరు మరియు  ముక్కు ద్వారా ఊపరితిత్తుల వరకూ ఇది వ్యాపిస్తుంది.

అప్పుడు వెంటనే మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ వెంటనే ఉత్తేజితమై శరీర అవయవాలపై దాడికి వచ్చిన ఆ వైరస్ తో పోరాడుతుంది. అప్పుడు మనకు దగ్గు, జలుబు వంటి లక్షణాలు బయటపడతాయి.

కొందరిలో అనగా ఒక ఐదు శాతం మందిలో మాత్రం  ఈ వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. దీనికి కారణం వీరిలో రోగనిరోధక శక్తి, యాంటీ బాడీలు తక్కువగా ఉండటమేనట. ఈ కరోనా వైరస్ చాలా తెలివైంది. కరోనా వైరస్ ఒక్కసారి మానవ శరీరానికి  వ్యాపించిన తరువాత అది మన శరీరంలో ఒక సురక్షిత భాగాన్ని చూసుకుంటుంది ముఖ్యంగా అది ఊపిరితిత్తుల అడుగుభాగానికి చేరిపోతోంది.

ఈ నేపథ్యంలో  ఊపిరితిత్తుల రక్షణకు అవి విడుదల చేసే సబ్బు లాంటి పదార్ధాన్ని అక్కడి నుండి విడుదలవకుండా అడ్డుకుంటుంది. అందుకే దీనివల్లే  ఊపిరిత్తుల్లో ద్రవాలు పెరిగిపోయి ఒక్కచోటనే క్లాట్ అవ్వడం వల్ల ఈ వైరస్ సోకిన వాళ్లలో శ్వాస సబంధిత సమస్య వస్తుంది. ఒక్కో సమయంలో ప్రాణాల కూడా పోవచ్చు.

మొత్తంగా చుస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో సగానికి పైగా అమెరికా, యూరోప్ లోని కొన్ని దేశాల్లోనే ఉన్నాయి. అక్కడ ఈ కరోనా వైరస్ విజృంభించడానికి ఇతర కారణాలున్నాయి. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో మాత్రం ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య తక్కువుగా ఉండటాన్ని బట్టి చూస్తే ఇది అందరిపై ఒకేవిధంగా ప్రభావాన్ని చూపడం లేదని అర్థమవుతుంది.

మనం బాగా అబివృద్ది చెందిన దేశాలుగా చెప్పుకునే అనేక దేశాల  ప్రజల అతి శుభ్రత వల్ల  అక్కడ కరోనా వారిపై దాడి చేయడానికి ప్రదాన కారణం. భారత్ లో అపరిశుభ్రతతో సాల్మనెల్లా, డయేరియా వంటివి రోగాలు వస్తాయి. వాటికి యాంటీ బ్యాక్టీరియల్ మందులు వాడుతుంటాం అవి సరిపోతాయి. కానీ అమెరికన్లు బ్యాక్టీరియా లేని ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో వారికి ఈ సమస్యలు వస్తున్నాయి.

అమెరికాలో వారు తినే ఆహారం బాగా శుద్ధి చేసిన ఆహారం దాంట్లో ఒక గ్రాముకు 10 నుంచి 100 బ్యాక్టీరియాలు కూడా ఉండవు. కానీ భారత్ లో లక్షలు, కోట్లు, మిలియన్లలో బాక్టీరియాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలా లేకపోతే మనం తీసుకునే  ఆహారంలో బ్యాక్టీరియాలు లేకపోతే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ శత్రువును ఎదుర్కొనే స్థాయి నుండి వృద్ధి చెందదు.

మన భారతదేశంలో చిన్నప్పుడు మనం వీదుల్లో మట్టి మరికు మురికి నీళ్ళు వంటి వాటితో ఆడుకుంటూ ఉంటాం దీనివల్ల మన శరీరం ఎన్నో బ్యాక్తీరియాలకు గురవుతుంది. 13 ఏళ్లు వయసు వచ్చే నాటికే మన పిల్లలపై సుమారు ఆరు కోట్ల బ్యాక్టీరియా మరియు వైరస్ లు వారిపై దాడి చేస్తాయి. దీంతో వాళ్ల శరీరం సహజంగానే  యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేసుకుంటుంది.

ఇవన్నీ మెమరీలో ఒక చోట నిక్షిప్తమవుతాయి. మళ్లీ ఎప్పుడైనా అలాంటి వైరస్ వాళ్లపై దాడి చేస్తే క్షణకాలంలోనే ఈ యాంటీబాడీలు వెంటనే అలర్ట్ అయ్యి ఆ వైరస్ ను కట్టడిచేస్తాయి. కొత్త వైరస్ లో కొత్త జీనోమ్ వచ్చినా మనలో తయారైన  ఈ యాంటీబాడీస్ నిలువరిస్తాయని ఈనాడు కు ఇచ్చిన ఇంటర్వూలో అన్నారు  అమెరికాలో ఉండే ప్రముఖ వైరాలజిస్టు డా.ఎమ్ .ఎస్ .రెడ్డి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular