గీతా గోవిందం మూవీతో తన నటనతో ప్రేక్షకుల ప్రసంసలు పొందిన Rashmika mandanna, కన్నడ కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టి ఎంగేజ్ మెంట్ బ్రేకప్ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కిరాక్ పార్టీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలోపడిన వీరిద్దరూ లాస్ట్ ఇయర్ కుటుంభ సభ్యుల సమక్షంలో నిర్చితార్ధం జరిగింది అయితే కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రష్మిక, రక్షిత్ శెట్టి కొన్ని కారణాల వల్ల విడిపోవాలనుకుoటున్నారు తమ సొంత కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఆంగ్ల వెబ్ సైట్ ఈ కధనాన్ని ప్రచురించింది
ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉండే రక్షిత్ బ్రేక్అప్ విషయమై దూరంగా ఉండాలని నిర్నయిoచుకోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. సోషల్ మీడియాకు ఇక సెలవు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
నేను కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను నాపై అభిమానం చూపిస్తున్న మీకు ధన్యవాదాలు అని రక్షిత్ పోస్ట్ పెట్టారు. ఇలాంటి పోస్ట్ నేపధ్యంలో వీరి మధ్య ఏదో జరిగిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో Rashmika mandanna హవా కొనసాగుతుంది తను నటించిన చలో, గీతా గోవిందం బారీ విజయాన్ని సాధించాయి