బంజారాహిల్స్ : హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాక్యాలు చేసాడనే కారణంగా సినీ విశ్లేషకుడు kathi mahesh పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేసారు.
పోలీసుల కధనం ప్రకారం జూన్ 29న టీవీ 9 చానెల్ లో ప్రసారమైన చర్చలో kathi mahesh రాముడిపై అనుచిత వ్యాక్యాలు చేశాడంటూ శ్రీధర్ అనే వ్యాపారి కొంత కాలంక్రితం పిర్యాదు చేసారు జీడీ ఎంట్రీ చేసిన పోలీసులు శుక్రవారం కత్తి మహేష్ పై ఐపీసీ 295 ఏ, 505 (2) సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసారు.
కత్తి మహేష్ పై కొంత కాలంగా నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే ఈ నేపధ్యంలో కత్తి ఇకపై తాను విజయవాడలో నివాసం ఉండనున్నట్లు గన్నవరం విమానాశ్రయంలో విలేకరులతో మహేష్ అన్నారు.
తాను ఆంద్రప్రదేశ్ వ్యక్తినేనని నేను హైదరాబాద్ లో తప్ప వేరే రాష్ట్రంలో ఎక్కడైనా నివసించవచ్చని అందుకే ఇకపై విజయవాడలో ఉండేందుకు వచ్చానని ప్రకటించారు.